Case Filed on OA Secretary: ఆ ప్లేయర్ ఫిర్యాదుతో ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరీపై కేసు నమోదు..
ABN , Publish Date - Dec 13 , 2025 | 08:04 PM
ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరీపై కేసు నమోదైంది. ఓ కబడ్డీ ప్లేయర్ ఫిర్యాదు మేరకు డీజీపీ ఆయనపై చర్యలకు ఉపక్రమించారు.
అమరావతి, డిసెంబర్ 13: ఒలింపిక్స్ అసోసియేషన్(Olympics Association) కార్యదర్శి కే.పిచ్చేశ్వర రావు(Pichheswara Rao)పై కేసు నమోదైంది. కే.గౌరీ అనే కబడ్డీ ప్లేయర్(Kabaddi Playaer Gowri) ఆయనపై డీజీపీ(DGP)కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు తాడేపల్లి గూడెం పోలీసులు తెలిపారు.
తనను ఇండియన్ కబడ్డీ వరల్డ్ కప్(Indian Kabaddi World Cup) టీమ్లో ఎంపిక చేయకుండా అడ్డుకున్నారని డీజీపీ సహా.. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pavan Kalyan)లకు ఇటీవల ఫిర్యాదు చేశారు గౌరీ. ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్స్ ఆడిన తనను ప్రపంచ కప్నకు సెలెక్ట్ చేయకుండా అడ్డుకున్నారని అందులో పేర్కొన్నారామె. దీంతో పిచ్చేశ్వర రావుపై డీజీపీ చర్యలకు ఉపక్రమించారు. డీజీపీ ఆదేశాల మేరకు తాడేపల్లి గూడెంలో ఆయనపై కేసు నమోదైంది.
ఇవీ చదవండి: