Share News

Malaysia Delegation: మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ

ABN , Publish Date - Oct 03 , 2025 | 01:20 PM

అమ‌రావ‌తి నిర్మాణం గురించి మ‌లేషియా బృందానికి మంత్రి వివరించారు. రెండున్న‌రేళ్ల‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

Malaysia Delegation: మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ
Malaysia Delegation

అమ‌రావ‌తి, అక్టోబర్ 3: సచివాల‌యంలో మలేషియా ప్ర‌తినిధుల‌తో మంత్రి నారాయ‌ణ‌ (Minister Narayana), సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబుఈరోజు (శుక్రవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మ‌లేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్‌కో మంత్రి ప‌ప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గ‌న‌బ‌తిరావ్, మ‌లేషియా - ఆంధ్రా బిజినెస్ ఛాంబ‌ర్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల పురోగ‌తిని క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన త‌ర్వాత భేటీ జరుగుతోంది. అమ‌రావ‌తి నిర్మాణం గురించి మ‌లేషియా బృందానికి మంత్రి వివరించారు. రెండున్న‌రేళ్ల‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు.


సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప్రపంచ‌లో టాప్ 5 రాజ‌ధానుల్లో అమ‌రావ‌తిని ఒక‌టిగా రూపుదిద్దుతామ‌ని వివరించారు. అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మ‌లేషియాకు చెందిన ప‌లు ప్రైవేట్ సంస్థ‌లు ఆస‌క్తి చూపారు. రాబోయే 5 ఏళ్ల‌లో 6000 నుంచి 10000 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేలా ప‌లు ప్రాజెక్ట్‌ల‌ను మంత్రి నారాయ‌ణ‌కు మ‌లేషియా ప్ర‌తినిధులు వివరించారు.


ఇవి కూడా చదవండి...

రెండు భారీ చోరీలు.. ఆందోళనలో ప్రజలు

దసరా ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై అరుదైన రికార్డ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 01:29 PM