Share News

Operation Sindoor.. అందరం కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం: టీడీపీ ఎంపీ

ABN , Publish Date - May 08 , 2025 | 02:04 PM

Operation Sindoor: పాకిస్థాన్‌లోని 9 టెర్రరిస్టుల స్థావరాలపై భారత సేనలు దాడి చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా టార్గెట్ చేధించమనేది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆల్ పార్టీ మీటింగ్‌లో వివరించారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు తెలిపారు. ఈ సందర్బంగా ఆర్మీ అధికారులకు ధన్యవాదాలు తెలిపామన్నారు.

 Operation Sindoor.. అందరం కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం: టీడీపీ ఎంపీ
Operation Sindoor

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Defense Minister Rajnath Singh) అధ్యక్షతన గురువారం అఖిలపక్ష సమావేశం (All Party Meeting) జరిగింది. ఈ భటీలో ప్రధానంగా భారత్ ఆర్మీ ఫోర్స్ (Indian Army Force) నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయాన్ని రాజ్‌నాథ్ సమావేశంలో వివరించారు. ఆపరేషన్‌ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్తాన్ (Pakistan) పీవోకే (POK) లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం (Terror Camps Destroyed చేసిందన్నారు. లష్కరే తోయిబా (Lashkar-e-Taiba), జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ప్రధాన కార్యాలయాలు సహా తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను నేలమట్టం చేసిందన్నారు. రాజ్‌నాథ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.


పాక్‌కు అందుతున్న సహాయం నిలిపివేయాలి..

అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్‌లోని 9 టెర్రరిస్టుల స్థావరాలపై భారత సేనలు దాడి చేశాయని, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా టార్గెట్ చేధించమనేది రాజ్‌నాథ్ సింగ్ వివరించాన్నారు. ఈ సందర్బంగా ఆర్మీ అధికారులకు ధన్యవాదాలు తెలిపామన్నారు. ఎటాక్ తర్వాత పాకిస్థాన్ ఆర్మీ ఏ విధంగా ఉగ్రవాదుల అంతిమ సంస్కారాలకు వెళ్ళారో చెప్పారన్నారు. అందరం భారతీయులుగా కలిసి కట్టుగా ఉండాల్సిన సమయమని, ఇండియన్ ఆర్మీ కి అందరం మద్దతుగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. పాకిస్తాన్‌పై వత్తిడి తెచ్చేందుకు వారికి ఆర్థికంగా అందుతున్న నిధులు, ప్రపంచ బ్యాంకుల నుంచి అందుతున్న సహాయం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించామన్నారు.

Also Read: ఆ ముగ్గురు నిందితుల కోసం సిట్ బృందం వేట


భారత పౌరులే టార్గెట్..

ఇద్దరు మహిళా అధికారులు మీడియా బ్రీఫింగ్ పాల్గొన్న అంశాన్ని అందరూ ప్రశంసించారని లావు కృష్ణ దేవరాయలు అన్నారు. భారత పౌరులను టార్గెట్ చేస్తున్నారని.. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చ జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని సమావేశంలో వివరించామన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, భారత సైన్యం మనోధైర్యం దెబ్బతీసే విధంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశానికి ఎందుకు రాలేదని ఒక్కరిద్దరు అడిగారని, అలా అడగడం సహజమని అన్నారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని ఏమైనా ఆలోచనలు ఉంటే తమతో చెప్పాలని, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని, ఎంత మంది టెర్రరిస్టులు చనిపోయారనేది చెప్పారని లావు కృష్ణదేవరాయలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 02:04 PM