Share News

CM Chandrababu: ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:18 PM

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

CM Chandrababu: ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
CM Chandrababu Naidu

అమరావతి: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్ హెచ్ జీ రంగాలు, రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలపై అధికారులతో చర్చించారు.


231 ఎస్ఎల్ బీసీలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సమీక్ష చేసిన సీఎం.. వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రపెన్యూర్ కార్యక్రమం, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చర్చలు జరిపారు. ఎస్ఎల్ బీసీ సమావేశాలు.. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించారు. రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇండికేటర్లు కూడా రోటీన్‌గా మారుతున్నాయని చెప్పారు.


తీరు మార్చుకోండి

ఖరీఫ్‌లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్ పుట్ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తమ తీరు మార్చుకోవాల్సి ఉందన్నారు. జీఎస్టీలో సంస్కరణల్ని కేంద్రం తీసుకువచ్చిందని. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు వచ్చేస్తున్నాయని.. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించకూడదని తెలిపారు. తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలన్నారు.


కొత్త ఆవిష్కరణల దిశగా..

అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా మన ఆర్ధిక వ్యవస్థ తయారు అవుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. 2047 నాటికి బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ తయారవుతుందన్నారు. ఈ క్రమంలోనే ఫాల్స్ లెండింగ్ చేయాలని ఎవరూ సిఫార్సు చేయరని, ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావని వ్యాఖ్యానించారు. పేదలు- ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్ధికశాస్త్రం చదివిన విద్యార్ధిగా, ప్రజాప్రతినిధిగా పేదల గురించి తాను ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఓ దశలో సంపద సృష్టి కోసం, పరిశ్రమల కోసం దావోస్ లాంటి ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగానన్నారు. దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు సమిష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.


Also Read:

ఆడుదాం ఆంధ్రాకు.. రూ.119కోట్లు దారపోశారు

అవినీతిలో అనకోండ.. అధికారిణిపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎకో ఫ్రెండ్లీ గణేష్ తయారీలో.. ఎన్టీఆర్ జిల్లా వరల్డ్ రికార్డ్‌

Updated Date - Aug 26 , 2025 | 01:57 PM