Share News

Tirupati : తిరుపతి జిల్లాలో లారీని ఢీకొన్న కారు

ABN , Publish Date - Jan 20 , 2025 | 03:59 AM

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్పగారిపల్లె వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు...

Tirupati : తిరుపతి జిల్లాలో లారీని ఢీకొన్న కారు

  • ఇద్దరు పిల్లలు, ఓ మహిళ దుర్మరణం

  • మరొకరి పరిస్థితి విషమం, ఇద్దరికి తీవ్ర గాయాలు

చంద్రగిరి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ రవణప్పగారిపల్లె వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన కార్తికేయ, ఆయన భార్య ఐశ్వర్య, కుమారులు జీవన్‌, విశ్వ, అత్త కలైవాణి, బావమరిది సతీష్‌ శ్రీవారి దర్శనార్థనం ఆదివారం కారులో తిరుమలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు సీట్లో ఉన్న జీవన్‌(10), విశ్వ(8) అక్కడిక్కడే మృతి చెందారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కలైవాణి(45) మృతి చెందారు. కార్తికేయ పరిస్థితి విషమంగా ఉండగా, ఐశ్వర్య, సతీ్‌షకు తీవ్ర గాయాలయ్యాయి.

Updated Date - Jan 20 , 2025 | 03:59 AM