Share News

AP News: న్యాయస్థానాలంటే జగన్‌కు లెక్క లేదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 16 , 2025 | 06:23 PM

వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం.. న్యాయస్థానాల పట్ల జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు.

AP News: న్యాయస్థానాలంటే జగన్‌కు లెక్క లేదు: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబర్ 16: వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం.. న్యాయస్థానాల పట్ల జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ‘జగన్ తన అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతాడు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నా అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. న్యాయస్థానాలంటే జగన్‌కు ఏమాత్రం లెక్కలేదు.’ అంటూ విమర్శలు గుప్పించారు సీఎం. పరకామణి చోరీ కేసును సాధారణ కేసుగా చూడటాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టిందని గుర్తు చేశారు సీఎం. భక్తులు కానుకగా సమర్పించిన సొమ్ము చోరీ కావటం సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం అని.. పరకామణి లెక్కింపులో కూడా ఏఐ వాడాలని న్యాయస్థానాలు చెప్పటం శుభ పరిణామం అన్నారు.


పీపీపీ వైద్య కళాశాలల విషయంలో వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను సైతం తప్పుదోవ పట్టించే యత్నం చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంపై తనను తప్పుదోవ పట్టించే యత్నం చేయవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి గట్టిగా చెప్పటంతో వారు వెనుదిరిగారన్నారు. పీపీపీ అనేది ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న సక్సెక్ మోడల్ అని.. అన్ని రంగాల్లోనూ ఇది అమలవుతోందన్నారు సీఎం. దీని కారణంగా సీట్లు పెరగటంతో పాటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉద్యోగ నియామక పత్రాలు అందచేయటం అభ్యర్థులకు గొప్ప అనుభూతినిస్తుందన్నారు ముఖ్యమంత్రి. నాడు డీఎస్సీ, నేడు యువగళం పేరిట పోలీసు కానిస్టేబుల్ నియామకాలు ఈ తరహా విధానం అందుకే అనుసరిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు.


Also Read:

ఫుల్‌టైమ్ గర్ల్ ఫ్రెండ్ జాబ్.. ఎంత మంది అప్లై చేశారంటే..

జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

Updated Date - Dec 16 , 2025 | 06:23 PM