CM Chandrababu Naidu: నాడు చెప్పాను.. నేడు చేసి చూపించాను
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:29 AM
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు కృష్ణా నది జలాలు ఇస్తాం. హంద్రీ-నీవాకు నీళ్లు ఇస్తాం....
హంద్రీ-నీవా జలాలపై సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ‘శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు కృష్ణా నది జలాలు ఇస్తాం. హంద్రీ-నీవాకు నీళ్లు ఇస్తాం.. వైసీపీ నేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకూ నీరు ఇస్తాం. జగన్ అడ్డంగా పడుకున్నా నీళ్లు ఇస్తాం’.. -2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి. కూటమి ప్రభుత్వం వచ్చాక పైన పేర్కొన్న అన్ని ప్రాంతాలకూ ప్రస్తుతం నీరిస్తున్నారు. దీనిపై ఆయన ఆదివారం స్పందిస్తూ.. ‘నాడు చెప్పాను.. నేడు చేసి చూపించాను’ అని ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. నాటి తన మాటల వీడియోను, ఆయా ప్రాంతాలకు నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News