AP Police : రేషన్ బియ్యం మాయం కేసులో ఆరో నిందితుడిగా పేర్ని నాని
ABN , Publish Date - Jan 01 , 2025 | 04:04 AM
తన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం వ్యవహారం లో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామ య్య(నాని)పై మచిలీపట్నం తాలూకా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
నగదు బదిలీలన్నీ ఆయన ఆదేశాలతోనే!
గోడౌన్ మేనేజర్ అంగీకారం
దాంతోనే మాజీ మంత్రిపై కేసు నమోదు
తెల్లవారుజామున అరెస్టుకు యత్నం
అదృశ్యమై హైకోర్టుకు వెళ్లిన మాజీ మంత్రి
6 వరకు తొందరపాటు చర్యలొద్దు: హైకోర్టు
మచిలీపట్నం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): తన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం వ్యవహారం లో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామ య్య(నాని)పై మచిలీపట్నం తాలూకా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఆయన్ను ఆరో నిందితుడు(ఏ-6)గా చేర్చారు. ఆయన గోడౌన్లో మేనేజరుగా పనిచేస్తున్న మానసతేజను పోలీసులు చె న్నైలో మూడ్రోజుల కిందట అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను విచారించగా.. మేనేజర్ బ్యాంకు ఖాతా నుంచి రూ.24 లక్షలను మిల్లు యాజమాని బొర్రా ఆంజనేయులు, లారీడ్రైవర్ బోట్ల మంగారావు, పేర్ని కుటుంబసభ్యు ల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తేలింది. పేర్ని నాని సూచనల మేరకే ఈ నగదును వివిద భ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు మానసతేజ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ వివరాలను నమోదుచేసిన పోలీసులు ఉన్నతాధికారుల సూచనల మేరకు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు మంగళవారం తెల్లవారుజామున ప్రయత్నించారు. ఇది తెలిసి ఆయన అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.