Janasena : ఆవిర్భావ సభను జయప్రదం చేయండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:29 AM
కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఈనెల 14న నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన టీసీ వరుణ్ పిలుపునిచ్చారు. నగరంలోని యాదవ కల్యాణమండపంలో ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీసీ..

జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్
అనంతపురం ప్రెస్క్లబ్, మార్చి4(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఈనెల 14న నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అహుడా చైర్మన టీసీ వరుణ్ పిలుపునిచ్చారు. నగరంలోని యాదవ కల్యాణమండపంలో ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీసీ వరుణ్ మాట్లాడుతూ అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇనచార్జ్లు, మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నగర కమిటీల నాయకులు,
కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవంలో సైనికుల్లా పనిచేయాలన్నారు. జిల్లా నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భవానీ రవికుమార్, నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, శింగనమల ఇనచార్జ్ సాకే మురళీ, తాడిపత్రి ఇనచార్జ్ శ్రీకాంత రెడ్డి, నాయకులు మణికంఠ, గౌతమ్, బాల్యం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....