AP High Court: జనసేనకు ఏపీ హైకోర్టులో ఊరట..

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:38 PM

అమరావతి: జనసేనకు ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తు కేటాయించింది. అయితే జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించవద్ధని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) హైకోర్టులో పిటిషన్‌ వేసింది.

అమరావతి: జనసేన (Janasena)కు ఏపీ హైకోర్టు (AP High Court)లో పెద్ద ఊరట (Big Relief) లభించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తు (Glass Mark) కేటాయించింది. అయితే జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించవద్ధని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (Rashtriya Praja Congress)(సెక్యులర్) హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఇటీవల ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. దీనిపై మంగళవారం తీర్పు జనసేనకు అనుకూలంగా వెలువరించింది. కాగా జనసేన పార్టీకి ఈసీ (Election Commission) గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ..రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 16 , 2024 | 12:42 PM