హోంమంత్రి ఇంటిని చుట్టుముట్టిన వరద..
ABN, Publish Date - Sep 02 , 2024 | 12:20 PM
విజయవాడ: నగరంలోని హోంమంత్రి వంగలపూడి అనిత నివాసాన్ని వరదనీరు చుట్టిముట్టింది. దీంతో తన పిల్లలను ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. రామవరప్పాడు వంతెన కింద జలదిగ్భందంలో తన ఇళ్లు ఉన్నా.. లెక్కచేయకుండా ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
విజయవాడ: నగరంలోని హోంమంత్రి వంగలపూడి అనిత నివాసాన్ని వరదనీరు చుట్టిముట్టింది. దీంతో తన పిల్లలను ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. రామవరప్పాడు వంతెన కింద జలదిగ్భందంలో తన ఇళ్లు ఉన్నా.. లెక్కచేయకుండా ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అనిత ఇంటి వద్దకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ముందు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చారు. వరద సహాయక కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా హోమంత్రి అనిత విజయవాడ కలెక్టరేట్లోనే ఉన్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. విజయవాడలోని అనేక ప్రాంతాలు, కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం తెల్లవారు జామున 4గంటల వరకు సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి వరదనీటిలోనే బోట్లపై ప్రయాణించి పర్యటించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, స్నాక్స్ అందజేశారు. ధైర్యంగా ఉండాలని, తాను ఉన్నానని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయవాడ -హైదరాబాద్ హైవేపై వరద ఉధృతి
తెలంగాణలో వర్షాలకు 10 మంది మృతి..
బ్యారేజీ డ్యామేజ్ చేయాలని కుట్ర..
అర్ధరాత్రి సింగ్ నగర్ వెళ్ళిన సీఎం చంద్రబాబు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 02 , 2024 | 12:20 PM