సీఎం రోజంతా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ..
ABN, Publish Date - Sep 03 , 2024 | 10:03 AM
అమరావతి: తాను కదిలి.. యంత్రాంగాన్ని వేగంగా నడిపిస్తూ.. వరద సహాయక చర్యలను సీఎం చంద్రబాబు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను తన కార్యాలయంగా మార్చుకున్నారు. చంద్రబాబు బృందం కలెక్టరేట్లోనే తిష్టవేసింది. రోజంతా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధతులను ప్రత్యక్షంగా కలుసుకుని ధైర్యం చెప్పడం..
అమరావతి: తాను కదిలి.. యంత్రాంగాన్ని వేగంగా నడిపిస్తూ.. వరద సహాయక చర్యలను సీఎం చంద్రబాబు ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను తన కార్యాలయంగా మార్చుకున్నారు. చంద్రబాబు బృందం కలెక్టరేట్లోనే తిష్టవేసింది. రోజంతా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధతులను ప్రత్యక్షంగా కలుసుకుని ధైర్యం చెప్పడం.. మధ్యలో విరామం సమయంలో కలెక్టరేట్కు చేరుకుని సమీక్ష నిర్వహించడం.. ఇలా అలుపెరగకుండా చంద్రబాబు పనిచేస్తున్నారు. మంత్రులందరూ విజయవాడ కలెక్టరేట్కు వచ్చి వరద బాధితులకు సాయం చేయడంలో నిమగ్నమయ్యారు.
బుడమేరు వరద బాధితులకు అందుతున్న సాయాన్ని పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు సోమవారం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. బోట్లలో వెళ్లడానికి అవకాశం లేని ప్రాంతాలకు హెలికాఫ్టర్ ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే రెండు హెలీకాఫ్టర్ల ద్వారా బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఆహారం అందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
శాంతించిన మున్నేరు.. వాహనాల పునరుద్ధరణ..
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ..
జగన్ భక్త అధికారులపై సీఎం సీరియస్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 03 , 2024 | 10:03 AM