బీఆర్ఎస్కు హైకోర్టులో చుక్కెదురు..
ABN, Publish Date - Nov 22 , 2024 | 01:54 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
హైదరాబాద్: బీఆర్ఎస్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంజ్ తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్లో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. దానిపై శుక్రవారం సుదీర్ఘ విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది.
అయితే బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్టోబర్ 9న సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. 4 వారాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ కోసం షెడ్యూల్ ఖరారు చేయాలంటూ స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ను ప్రతివాదులుగా చేరుస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో అసెంబ్లీ కార్యదర్శి ఆ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంజ్ను ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. స్పీకర్కు ఏలాంటి టైం బాండ్ లేదని.. రీజనబుల్ సమయంలో సభాపతి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు: షర్మిల
అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర: కేటీఆర్
పీఏసీ సభ్యుల ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్
ఏపీలో పీఏసీ సభ్యులకు తొలిసారి ఎన్నిక..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 22 , 2024 | 01:54 PM