Share News

Congress: అసెంబ్లీలో 65కు చేరిన కాంగ్రెస్‌ బలం..

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:09 AM

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో విజయంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 65కు పెరిగింది. ఇప్పటిదాకా ఆ పార్టీకి అసెంబ్లీలో 64 మంది సభ్యుల బలం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు కాంగ్రె్‌సలో చేరిపోయారు.

Congress: అసెంబ్లీలో 65కు చేరిన కాంగ్రెస్‌ బలం..

  • బీఆర్‌ఎస్‌ నుంచి చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు,

  • సీపీఐ ఎమ్మెల్యేతో కలిపితే మొత్తంగా 69కి చేరిక

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో విజయంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 65కు పెరిగింది. ఇప్పటిదాకా ఆ పార్టీకి అసెంబ్లీలో 64 మంది సభ్యుల బలం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు కాంగ్రె్‌సలో చేరిపోయారు. తొలి నుంచి కాంగ్రె్‌సకు మద్దతు ఇస్తున్న సీపీఐకి ఓ ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తంగా అసెంబ్లీలో కాంగ్రె్‌సకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 69కి చేరింది. ఇక, కంటోన్మెంట్‌లో ఓటమితో అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యుల సంఖ్య సాకేంతికంగా 38కు పడిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి చేరిన ముగ్గురినీ లెక్కేస్తే ఆ సంఖ్య 35కు తగ్గుతుంది. భవిష్యత్‌లో మరికొందరు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లేదా బీజేపీ గూటికి చేరుతారని తెలుస్తోంది.

Updated Date - Jun 05 , 2024 | 06:09 AM