Share News

PM Modi: మరోసారి బీజేపీ ప్రభుత్వమే.. తెలంగాణలో కూడా ఇదే ఫలితం..

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:42 PM

మరికాసేపట్లో డిల్లీలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బీజేపీ విజయ సంకల్ప సభ జరుగుతోంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ షెడ్యూల్ కన్నా ముందే ప్రజలు ఫలితాలను ఇచ్చారన్నారు.

PM Modi: మరోసారి బీజేపీ ప్రభుత్వమే.. తెలంగాణలో కూడా ఇదే ఫలితం..

నాగర్ కర్నూల్: మరికాసేపట్లో డిల్లీ (Delhi)లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బీజేపీ (BJP) విజయ సంకల్ప సభ జరుగుతోంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ షెడ్యూల్ కన్నా ముందే ప్రజలు ఫలితాలను ఇచ్చారన్నారు. మరోసారి బీజేపీ ప్రభుత్వమేనని.. తెలంగాణ (Telangana) కూడా ఇదే ఫలితం ఉంటుందన్నారు. నిన్న మల్కాజ్‌గిరిలో ఇదే చూశానని.. అక్కడ ప్రజలు బీజేపీని ఆశీర్వదించారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ (BRS) వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర కోపం.. వారిని ఓడించిందన్నారు. ఇపుడు తన పట్ల ప్రజానీకమంతా ప్రేమ కురిపిస్తోందని మోదీ అన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:44 PM