Share News

TS News: మాజీ ఎంపీపీపై దాడి.. సూర్యాపేటలో ఉద్రిక్తత

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:37 AM

Telangana: జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్థులు దాడి చేశారు. గుడిబండ గ్రామ నాయి బ్రాహ్మణులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకున్నారంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు.

TS News: మాజీ ఎంపీపీపై దాడి.. సూర్యాపేటలో ఉద్రిక్తత

సూర్యాపేట, జనవరి 30: జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్థులు దాడి చేశారు. గుడిబండ గ్రామ నాయి బ్రాహ్మణులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకున్నారంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం కవిత ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు చేరుకుని ఆందోళన చేపట్టారు. పట్టా పేపర్లతో తమ స్థలాలు తమకు అప్పజెప్పాలని కవిత ఇంటిముందు టెంట్ వేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో కవితపైనా గ్రామస్తులు దాడి చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్థులకు నచ్చజెప్పడంతో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో గుడిబండ గ్రామంలో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 30 , 2024 | 11:37 AM