Share News

Sangareddy Dist: జోగిపేట పట్టణంలో సెల్ టవర్ ఎక్కి సైకో హల్చల్...

ABN , Publish Date - Apr 21 , 2024 | 12:54 PM

సంగారెడ్డి జిల్లా: జోగిపేట పట్టణంలో ఓ సైకో సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. శేఖర్ అనే బాలుడిని హత్య చేశానని చెబుతూ నాగరాజు అనే సైకో హల్ చల్ చేశాడు. శేఖర్ అనే బాలుడు పని చేస్తున్న ఓ స్క్రాప్ దుకాణంలో నాగరాజు రాగితీగ దొంగతనం చేశాడు. ఆ విషయాన్ని..

Sangareddy Dist:  జోగిపేట పట్టణంలో సెల్ టవర్ ఎక్కి సైకో హల్చల్...

సంగారెడ్డి జిల్లా: జోగిపేట పట్టణంలో ఓ సైకో (Psycho) సెల్ టవర్ (Cell Tower) ఎక్కి హల్ చల్ (Hal Chal) చేశాడు. శేఖర్ (Sekhar) అనే బాలుడిని హత్య చేశానని చెబుతూ నాగరాజు (Nagaraju) అనే సైకో హల్ చల్ చేశాడు. శేఖర్ అనే బాలుడు పని చేస్తున్న ఓ స్క్రాప్ దుకాణంలో నాగరాజు రాగితీగ దొంగతనం చేశాడు. ఆ విషయాన్ని శేఖర్ తన యజమానికి చెప్పడంతో శేఖర్‌‌పై నాగరాజు పగ పెంచుకున్నాడు.


నిన్న రాత్రి శేఖర్ అనే బాలున్ని చంపానని చెప్పి కత్తి వెంటపెట్టుకొని నాగరాజు సెల్‌పోన్ టవర్‌ ఎక్కాడు. కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు (Police) నాగరాజును కిందికి దింపేందుకు యత్నించారు. హత్య చేశానని చెబుతున్న శేఖర్ ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో శేఖర్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఖాళీ అవుతున్న గుడివాడ రూరల్ వైసీపీ..

రంగారెడ్డి జిల్లా: నడుస్తున్న కారులో మంటలు..

వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 01:00 PM