Share News

Kishan Reddy: బీఆర్‌ఎస్‏కు ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టే...

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:30 AM

బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే, అది మూసీ నదిలో వేసినట్టేనని కేంద్రమంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. శనివారం గుడిమల్కాపూర్‌ నుంచి మెహిదీపట్నం, పద్మనాభనగర్‌లో బైక్‌ర్యాలీ రోడ్‌షోను నిర్వహించారు.

Kishan Reddy: బీఆర్‌ఎస్‏కు ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టే...

- రోడ్డు షోలో కేంద్ర మంతి కిషన్‌రెడ్డి

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే, అది మూసీ నదిలో వేసినట్టేనని కేంద్రమంత్రి, బీజేపీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. శనివారం గుడిమల్కాపూర్‌ నుంచి మెహిదీపట్నం, పద్మనాభనగర్‌లో బైక్‌ర్యాలీ రోడ్‌షోను నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మూడోసారి నరేంద్రమోదీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశ ప్రజల కోసం అహర్నిషలు కష్టపడుతున్న మహోన్నతమైన వ్యక్తి నరేంద్రమోదీ(Narendra Modi) అని ఆయన కొనియాడారు. నాంపల్లి నియోజకవర్గంలో ఓట్లు చీలకుండా మనమంతా ఐక్యంగా ఉండి బీజేపీని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంట బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి అన్నపురం రమేశ్‌కుమార్‌, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాహుల్‌చంద్ర, డివిజన్‌ అధ్యక్షులు ముఖేశ్‌, జనార్థన్‌రావు, విజయ్‌, బీజేపీ నాయకులు దేవర శ్రీనివాస్‌, దేవర తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి: Patnam Sunita Mahender Reddy: నేను లోకల్‌.. రాగిడి నాన్‌లోకల్, డమ్మీ క్యాడిండేట్‌

Updated Date - Apr 13 , 2024 | 11:30 AM