Share News

Bandi Sanjay: రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదు..

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:05 AM

Telangana: అయోధ్య రామయ్య అందరికీ దేవుడని.. రామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. గురువారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

Bandi Sanjay: రామమందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదు..

కరీంనగర్‌, జనవరి 11: అయోధ్య రామయ్య అందరికీ దేవుడని.. రామ మందిర నిర్మాణం బీజేపీ కార్యక్రమం కాదని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) స్పష్టం చేశారు. గురువారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు.

కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యూడిషియల్ విచారణ అడుగుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 11 , 2024 | 10:07 AM