Share News

Minister Thummala: వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 08:05 PM

వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) అన్నారు. బుధవారం నాడు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Minister Thummala: వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు ఇవ్వాలి

హైదరాబాద్: వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) అన్నారు. బుధవారం నాడు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..... రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌‌‌ను అనుసంధానం చేయడానికి రైతుల సమస్యలను పరిష్కరించే ‘రైతు నేస్తం’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దశలవారీగా మూడేళ్లలో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన, రూ.97 కోట్లతో ప్రాజెక్టును అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.

మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 4.07 కోట్లు విడుదల చేసిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సమస్యలపై అధికారులకు తెలియజేయవచ్చని అన్నారు. అలాగే రైతుల అనుభవాలను పంచుకోవచ్చని తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 08:05 PM