Share News

Phone Tapping: ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. వారి ఇళ్లల్లో సోదాలు..

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:50 AM

Hyderabad News: మాజీ డీఎస్‌పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు వ్యవహారంలో మాజీ పోలీసు అధికారుల(Ex Police Officials) ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో(Prabhkar Rao) పాటు పలువురు ఇళ్లలో సోదాలు..

Phone Tapping: ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. వారి ఇళ్లల్లో సోదాలు..
Phone Tapping Case

Hyderabad News: మాజీ డీఎస్‌పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకు వ్యవహారంలో మాజీ పోలీసు అధికారుల(Ex Police Officials) ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో(Prabhkar Rao) పాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న ఇళ్లలో సోదాలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఓ న్యూస్ చానల్ ఎండీ శ్రవణ్ రావు ఇంట్లో కూడా పోలీసులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే, శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 09:50 AM