Moinabad: మొయినాబాద్ మర్డర్ కేసు.. మిస్టరీ వీడేనా?
ABN , Publish Date - Jan 11 , 2024 | 09:49 PM
మొయినాబాద్లో జరిగిన యువతి మర్డర్ కేసు సస్పెన్స్ రేపుతుంది. మూడు రోజులు గడుస్తున్నా సింగల్ క్లూ కూడా లభించలేదు.చనిపోయిన యువతి ఎవరో పోలీసులు తేల్చేలేకపోతున్నారు. చనిపోయిన యువతి ఎవరో తెలుస్తే హంతకులను పట్టుకుంటామని పోలీసులు మీడియాకు తెలిపారు.
![Moinabad: మొయినాబాద్ మర్డర్ కేసు.. మిస్టరీ వీడేనా?](https://media.andhrajyothy.com/media/2023/20231205/Moinabad_CASE_1289c01243.jpg)
రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్లో జరిగిన యువతి మర్డర్ కేసు సస్పెన్స్ రేపుతుంది. మూడు రోజులు గడుస్తున్నా సింగల్ క్లూ కూడా లభించలేదు.చనిపోయిన యువతి ఎవరో పోలీసులు తేల్చేలేకపోతున్నారు. చనిపోయిన యువతి ఎవరో తెలుస్తే హంతకులను పట్టుకుంటామని పోలీసులు మీడియాకు తెలిపారు. యువతి ప్యాంట్ వెనక భాగం జేబు ఉన్న స్టిక్కర్ లభ్యం అయింది. మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోవడంతో ఐఎంఈ నెంబర్ సిమ్ కార్డు గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. యువతి వయసు సుమారుగా 20 సంవత్సరాల లోపు ఉంటుందని పోలీసుల అంచనా వేశారు. శాటిలైట్ నెట్ వర్క్ లొకేషన్ & సిమ్ ట్రాకింగ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ ఫోన్ స్విఛ్చాఫ్ & సిమ్ రిమూవ్ ఫ్రం ఫోన్ నెట్వర్క్ ట్రాకింగ్పై పోలీసులు దృష్టి సారించారు.
సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్, యువతి మొబైల్ ఫోన్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పైనే ఆధారపడి ఉంది. యువతి మర్డర్ కేస్ మిస్టరీ దర్యాప్తు కొరకు 7 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మర్డర్ స్పాట్లో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు , క్లూస్ టీమ్ పరిశీలిస్తుంది. అత్యవసరం సమీపంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఫుటేజ్ లభించడం లేదు. ఒక రూట్లో వచ్చి.. మరో రూట్లో నిందితుల పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిని ఎక్కడో హత్య చేసి బైక్ మీద ఇక్కడకు తీసుకువచ్చి కాల్చివేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.