Share News

Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత అగ్రహం

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:36 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా సీఎం వైఖరిపై మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత  అగ్రహం

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా సీఎం వైఖరిపై మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్‌పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తోందన్నారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కవిత వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 06 , 2024 | 11:36 AM