TS NEWS: మీర్పేట్లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం.. మనస్తాపంతో మృతి
ABN , Publish Date - Jan 30 , 2024 | 06:55 PM
షాపులో ఒంటరిగా ఉన్నయువతిపై సెలూన్ యజమాని అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీర్పేట్లో జరిగింది. యువతిపై అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం రేపింది.
![TS NEWS: మీర్పేట్లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం.. మనస్తాపంతో మృతి](https://media.andhrajyothy.com/media/2023/20231205/1d_c89466cad7.jpg)
హైదరాబాద్: షాపులో ఒంటరిగా ఉన్న యువతిపై సెలూన్ యజమాని అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీర్పేట్లో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. దేవరకొండ తక్కెళ్లపల్లికి చెందిన దివ్య.. హైదరాబాద్లోని మీర్పేట్ సెలూన్లో ఆరు నెలలుగా పనిచేస్తోంది. నిన్న ఎవరూ లేని సమయంలో సెలూన్లో ఉన్న యువతిపై మురళి అత్యాచారయత్నం చేశాడు. సెలూన్లో ఉన్న శానిటైజర్ తాగి ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దివ్య మృతి చెందింది. యువతి మృతదేహంతో సెలూన్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దివ్య మృతికి కారణమైన మురళిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సెలూన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. యువతి మృతిపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.