Share News

TS News: సీఎం రేవంత్ రెడ్డితో మేయర్ విజయలక్ష్మి భేటీ

ABN , Publish Date - Feb 03 , 2024 | 02:39 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం‌కు మేయర్ వినతి చేశారు.

TS News:  సీఎం రేవంత్ రెడ్డితో మేయర్ విజయలక్ష్మి భేటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwala Vijayalakshmi) శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం‌కు మేయర్ వినతి చేశారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం, బల్దియా ఆర్థిక పరిస్థితిపై రేవంత్‌తో చర్చించారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడంతో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు హైకోర్టుకు వెళ్ళినట్లు సీఎం దృష్టికి మేయర్ తీసుకెళ్లారు. కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేలా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని మేయర్ విజయలక్ష్మి కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 03 , 2024 | 04:46 PM