Share News

Mallareddy: నన్ను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారు

ABN , Publish Date - Mar 02 , 2024 | 01:14 PM

తనను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చేస్తోందన్నారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారన్నారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజ్‌కి రోడ్డు వేశామన్నారు.

Mallareddy: నన్ను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారు

హైదరాబాద్: తనను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చేస్తోందన్నారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారన్నారు. హెచ్ఎండీఏ (HMDA) అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజ్‌కి రోడ్డు వేశామన్నారు. 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామన్నారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక పై మా కాలేజ్ వద్ద ట్రాఫిక్ (Traffic) సమస్య విపరీతంగా పెరిగిపోతుందని మల్లారెడ్డి అన్నారు.

YSRCP: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు చూస్తుంటే వైఎస్సార్సీపీ ఓడిపోతుందని ఒప్పుకున్నట్టేనా..!

Chittoor: చిత్తూరులో టెన్షన్ టెన్షన్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 01:14 PM