Share News

TS News: ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్తులు..

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:41 AM

ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. పనుక్ కంపెనీ పేరిట వెబ్‌సైట్ నిర్వహించారు. కంపెనీలో పెట్టుబడి పెడితే లక్షకు రూ.4 లక్షలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.

TS News: ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్తులు..

హైదరాబాద్: ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. పనుక్ కంపెనీ పేరిట వెబ్‌సైట్ నిర్వహించారు. కంపెనీలో పెట్టుబడి పెడితే లక్షకు రూ.4 లక్షలు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. స్కీంలో కొత్త వారిని చేర్చితే 500 నుంచి 1000 రూపాయలు కమిషన్ ఆశ చూపిస్తున్నారు.

కొద్దిరోజుల నుంచి కంపెనీ వెబ్ సైట్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైన్ సిస్టమ్‌గా పది వేల మంది రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేశారని సైబర్ క్రైమ్ పోలీసులకు కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. 1000 మంది చొప్పున 10 వాట్సప్ గ్రూపులను సైబర్ క్రిమినల్స్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 10:41 AM