Share News

CM Jagan: లోటస్ పాండ్‌కు సీఎం జగన్.. తల్లి విజయమ్మతో భేటీ

ABN , Publish Date - Jan 04 , 2024 | 02:15 PM

Telangana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి లోటస్ పాండ్‌కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్‌ పాండ్‌కు వచ్చారు. ప్రస్తుతం లోటస్‌ పాండ్ తల్లి విజయమ్మ ఉన్నారు. ఈ సందర్భంగా తల్లి విజయమ్మతో జగన్ భేటీ అయ్యారు.

CM Jagan: లోటస్ పాండ్‌కు సీఎం జగన్.. తల్లి విజయమ్మతో భేటీ

హైదరాబాద్, జనవరి 4: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) లోటస్ పాండ్‌కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్‌ పాండ్‌కు వచ్చారు. ప్రస్తుతం లోటస్‌ పాండ్ తల్లి విజయమ్మ (YS Vijayamma) ఉన్నారు. ఈ సందర్భంగా తల్లి విజయమ్మతో జగన్ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు తల్లితో జగన్ సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుంచి బేగంపెట విమానాశ్రయానికి సీఎం బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌లో పర్యటన ముగించుకుని తిరిగి ఏపీకి వెళ్లేందుకు జగన్ బేగంపేటకు బయలుదేరారు.


కాగా.. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా ముందుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను జగన్ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్‌తో జగన్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇటీవలే కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా నందినగర్‌లో కేసీఆర్‌ నివాసానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో జగన్‌కు బీఆర్‌ఎస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకున్నారు. కేసీఆర్‌ నివాసం వద్ద జగన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) సాదర స్వాగతం పలికారు. స్వయంగా కేటీఆర్ జగన్‌ను తీసుకుని లోపలికి వెళ్లారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 04 , 2024 | 02:20 PM