Share News

Kavitha: జీవో 3పై దీక్షకు అనుమతి ఇవ్వాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 10:26 PM

భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలుల్లో జరుగుతున్న అన్యాయంపై ఈనెల 8వ తేదీన ధర్నాను తలపెట్టారు.

Kavitha: జీవో 3పై దీక్షకు అనుమతి ఇవ్వాలి

హైదరాబాద్: భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలుల్లో జరుగుతున్న అన్యాయంపై ఈనెల 8వ తేదీన ధర్నాను తలపెట్టారు. ఎల్లుండి(శుక్రవారం) దీక్ష ఉన్న పోలీస్ శాఖ ఇంకా అనుమతి ఇవ్వలేదని అన్నారు. డీజీపీ రవిగుప్తాతో ఫోన్లో మాట్లాడారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని కవిత చెప్పారు. ఈ దీక్ష ద్వారా జీవో3 వల్ల జరిగే నష్టాన్ని తెలియజేసే అవసరం ఉందని చెప్పారు. శాంతియుతంగానే తాము దీక్షను నిర్వహిస్తామని డీజీపీ రవిగుప్తాకు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 11:06 PM