Share News

Hyderabad: ఎండ @ 43.3 డిగ్రీలు.. సీజన్‌లో రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత

ABN , Publish Date - Apr 23 , 2024 | 01:25 PM

నగరంలో సూర్యుడు మళ్లీ భగ్గుమన్నాడు. నిన్న, మొన్నటిదాకా కాసింత చల్లబడిన వాతావరణం సోమవారం ఒక్కసారిగా వేడెక్కింది. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలుకావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Hyderabad: ఎండ @ 43.3 డిగ్రీలు.. సీజన్‌లో రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత

- మారుతీనగర్‌లో నమోదు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో సూర్యుడు మళ్లీ భగ్గుమన్నాడు. నిన్న, మొన్నటిదాకా కాసింత చల్లబడిన వాతావరణం సోమవారం ఒక్కసారిగా వేడెక్కింది. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలుకావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదికూడా చదవండి: Ponnam Prabhakar: ‘బిడ్డా సంజయ్.. నా తల్లిని తిడతావా’.. బండిపై పొన్నం ఫైర్

సరూర్‌నగర్‌(Sarurnagar)లోని మారుతీనగర్‌లో రికార్డుస్థాయిలో 43.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదర్శ్‌నగర్‌, ఉస్మానియా యూనివర్సిటీ(Adarshnagar, Osmania University)లో 43, ఖాజాగూడ స్పోర్ట్స్‌కాంప్లెక్స్‌ 42.9 జియాగూడ,బన్సీలాల్‌పేట, సీబీసీఐడీ కాలనీలలో 42.8 డిగ్రీలు నమోదైంది.

ఇదికూడా చదవండి: BJP leader: ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2024 | 01:29 PM