Share News

CM Revanth: రేపు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Feb 12 , 2024 | 07:55 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (రేపు) మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ డ్యామేజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు.

CM Revanth: రేపు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (రేపు) మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ డ్యామేజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. మేడిగడ్డ బ్యారేజీ లోపాలు, ఖర్చు గురించి అధికారులు వివరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ సందర్శన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఐజీ శ్రీనివాస్, ఎస్పీ కిరణ్ ఖర్గే పరిశీలించారు.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోయింది. బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న బ్రిడ్జి ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతో పైన వంతెన కుంగింది. లక్ష్మీ బ్యారేజీ మొత్తం పొడవు 1.6 కిలోమీటర్లు. 2019లో గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటి బ్యారేజీ అనే సంగతి తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 08:01 AM