Share News

Hyderabad: వందరోజుల మా పాలనను ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు: రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:36 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వంద రోజుల పాలనను ఆశీర్వదిస్తూ 8 లోక్‌సభ స్థానాలతో పాటుగా కంటోన్మెంట్‌ శాసనసభ ఉపఎన్నికల్లోనూ కాంగ్రె్‌సకు విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Hyderabad: వందరోజుల మా పాలనను ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వంద రోజుల పాలనను ఆశీర్వదిస్తూ 8 లోక్‌సభ స్థానాలతో పాటుగా కంటోన్మెంట్‌ శాసనసభ ఉపఎన్నికల్లోనూ కాంగ్రె్‌సకు విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదాలు తమ ఆత్మస్థైర్యాన్ని పెంచాయని, మరింత సమర్థవంతమైన పాలనను అందించడానికి ఉత్సాహాన్ని ఇచ్చాయని ఆయన అన్నారు. ప్రజల మద్దతు కాంగ్రె్‌సకే ఉన్నదన్న విషయం మరోమారు రుజువు చేశాయన్నారు. కాంగ్రెస్‌ విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ మంగళవారం ఓ ప్రకటనలో రేవంత్‌ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలనను అందిస్తామని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రజా పాలన ఉంటుందని రేవంత్‌ తెలిపారు.


కాంగ్రెస్‌ శ్రేణులకు అభినందనలు: భట్టివిక్రమార్క

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఇండియా కూటమి అభ్యర్థులు రికార్డుస్థాయి మెజారిటీలు సాధించేందుకు కృషి చేసిన కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 05 , 2024 | 05:36 AM