Share News

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ABN , Publish Date - Feb 01 , 2024 | 09:10 AM

ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్‌లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం  రేవంత్ రెడ్డి పర్యటన

ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్‌లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 09:10 AM