Share News

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ABN , Publish Date - Apr 21 , 2024 | 09:01 AM

ఆదిలాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఆదిలాబాద్: ఎన్నికల (Elections) నేపథ్యంలో నామినేషన్ల (Nominations) పర్వం ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి (Congress MP Candidate) ఆత్రం సుగుణ (Atram Suguna) నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనంతరం డైట్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.


కాగా ఆత్రం సుగణ.. మొన్నటి వరకు ప్రభుత్వ టీచర్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి వామపక్ష భావజాలానికి ఆకర్షితులైన సుగణ.. అనేక ప్రజా ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ యాక్టివ్‌గా పాల్గొన్నారు. సాధారణ టీచర్ అయిన సుగుణకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కటంపై అనేక వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ గులకరాయి కేసు: వేముల దుర్గారావు అరెస్టు.. విడుదల..

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 09:05 AM