TS News: తెలంగాణ వ్యాప్తంగా 12 ఆర్టీఏ కార్యాలయల్లో ఏసీబీ సోదాలు..
ABN , Publish Date - May 29 , 2024 | 06:59 AM
మలక్ పేట్, బండ్లగూడా, టోలిచౌకి, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్, మహబూబాబాద్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాలూరు చెక్ పోస్ట్ నిజామాబాద్, భోరజ్ చెక్ పోస్ట్ ఆదిలాబాద్, అశ్వరావు పేట చెక్ పోస్ట్ ఖమ్మంలోను తనిఖీలు చేపట్టారు.
![TS News: తెలంగాణ వ్యాప్తంగా 12 ఆర్టీఏ కార్యాలయల్లో ఏసీబీ సోదాలు..](https://media.andhrajyothy.com/media/2024/20240511/aa_77c9690b7c.jpg)
హైదరాబాద్: మలక్ పేట్, బండ్లగూడా, టోలిచౌకి, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్నగర్, మహబూబాబాద్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాలూరు చెక్ పోస్ట్ నిజామాబాద్, భోరజ్ చెక్ పోస్ట్ ఆదిలాబాద్, అశ్వరావు పేట చెక్ పోస్ట్ ఖమ్మంలోను తనిఖీలు చేపట్టారు. ఏసీబీ సోదాల్లో లెక్కలు చూపని మొత్తం 2లక్షల 70 వేల720 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Telangana : బీర్లకు బార్లా నిజమే!
లెక్కలోకి రాని సొమ్ముతో పాటు పలు అవకతవకలను సైతం ఏసీబీ అధికారులు గమనించారు. సోదాల్లో మొత్తం 15 బృందాలు పాల్గొన్నాయి. తప్పు చేసిన అధికారులపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపామని ఏసీబీ వెల్లడించింది. అవినీతికి పాల్పడిన, లంచం డిమాండ్ చేసిన టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ 1064కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు. అవినీతి అధికారులపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు.
Telangana : మూడు రోజులు సుర్రుమననున్న ఎండలు
Read more Telangana News and Telugu News