Share News

Yashasvi Jaiswal: విరాట్ భయ్యాతో కలిసి ఆడటం ఎంతో గొప్పగా అనిపించింది

ABN , Publish Date - Jan 15 , 2024 | 02:46 PM

విరాట్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం గురించి యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం అప్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఈ ఇద్దరు ఆటగాళ్లు 57 పరుగుల భాగస్వామ్యం చేశారు.

Yashasvi Jaiswal: విరాట్ భయ్యాతో కలిసి ఆడటం ఎంతో గొప్పగా అనిపించింది

ఆదివారం జరిగిన రెండో టీ20లో అప్గానిస్థాన్‌ను ఓడించి భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. టీమ్ ఇండియా విజయంలో యంగ్ స్టార్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కీలక పాత్ర పోషించాడు. అతను 34 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో తన పాత్రపై తనకు స్పష్టత ఉందని, రెండో టీ20లో మంచి స్ట్రైక్ రేట్‌తో జట్టుకు శుభారంభం అందించేందుకు ప్రయత్నిస్తున్నానని యశస్వి చెప్పాడు.

భారత్ తరఫున నాలుగు టెస్టులు 16 టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్ అవకాశం దొరికినప్పుడల్లా జట్టుకు తన వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ప్రాక్టీస్‌ సమయంలో చాలా కష్టపడి పని చేస్తానని చెప్పాడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా జట్టుకు తన బెస్ట్ అందించడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు.


అయితే క్రీజులో సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి(Virat kohli)తో ఏం సంభాషణ జరిగిందని యశస్విని అడిగినప్పుడు? అతను స్పందిస్తూ తాను విరాట్ భయ్యాతో ఎప్పుడు బ్యాటింగ్ చేసినా అది తనకు ఎంతో గౌరవమని చెప్పారు. విరాట్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు. షాట్‌లను ఎక్కడ కొట్టాలి అనే దాని గురించి సంభాషణ జరిగిందని ఈ సందర్భంగా యశస్వి తెలిపారు. తన స్ట్రైక్ రేట్‌ను మెరుగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు. రెండో వికెట్‌కు విరాట్ కోహ్లీతో కలిసి యశస్వి జైస్వాల్ 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Updated Date - Jan 15 , 2024 | 02:51 PM