Share News

Yashasvi Jaiswal: రూ.5.38 కోట్లతో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్... నిజమేనా?

ABN , Publish Date - Feb 22 , 2024 | 12:29 PM

భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం స్టార్ యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటివల ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా డబుల్ సెంచరీలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు. అయితే ఇటివల యశస్వి ముంబైలో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Yashasvi Jaiswal: రూ.5.38 కోట్లతో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్... నిజమేనా?

భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం స్టార్ యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటివల ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా డబుల్ సెంచరీలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు. అంతేకాదు మరికొన్ని రికార్డులు సాధించేందుకు చేరువలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే యశస్వి గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఈ యువ ఆటగాడు ముంబై(mumbai)లోని బాంద్రా(bandra)లో మరో ఇంటిని కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

జైస్వాల్ X BKCలో దాదాపు రూ. 5.4 కోట్లతో 1,100 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారని తెలిసింది. లీజ్ ఫోరస్ పొందిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం, ఈ ఫ్లాట్ బాంద్రా(bandra) (తూర్పు)లోని ఉంది. ఈ భవనం వింగ్ 3లో ఉందని, జనవరి 7న రిజిస్టర్ అయినట్లు చూపిస్తుంది. డీల్ ధర చదరపు అడుగుకు రూ.48,499. అయితే దీనికంటే ముందు యశస్వి థానేలో 5 BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: బుమ్రా లేడు.. ఎలా ఇప్పుడు?


ఇటీవల రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌(england)తో జరిగిన మూడో టెస్టులో జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు కొట్టి రికార్డు బద్దలు కొట్టాడు. జైస్వాల్ ఇంతకుముందు 2020లో అండర్-19 ప్రపంచకప్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో తనను రూ. 2.4 కోట్లకు దక్కించుకున్నారు. ఆ క్రమంలోనే 2023లో రాజస్థాన్ రాయల్స్(RR) తరఫున 14 మ్యాచుల్లో ఆడి మొత్తం 625 పరుగులతో ఆకట్టుకున్నాడు.

22 ఏళ్ల జైస్వాల్‌(Yashasvi Jaiswal) చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఒకానొక సమయంలో ఆజాద్ మైదానంలోని టెంట్‌లో కూడా కొన్నిరోజులు పడుకున్నాడు. కానీ ఇప్పుడు యశస్వికి మంచి రోజులు వచ్చాయి. అతను ముంబైలో తన రెండో ఇంటిని కొనుగోలు చేశాడని తెలుస్తోంది. యశస్వి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని బదోహిలో నివసిస్తున్నారు.

Updated Date - Feb 22 , 2024 | 12:29 PM