Share News

Viral: సముద్రగర్భంలో దాగున్న వేల కోట్ల నిధి.. వెలికి తీసేందుకు రంగంలోకి దిగిన కంపెనీ!

ABN , Publish Date - Mar 19 , 2024 | 05:44 PM

మూడు శతాబ్దాల క్రితం వేల కోట్ల బంగారంతో సముద్రంలో మునిగిపోయిన నావ. దాని జాడ కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన కంపెనీ.

Viral: సముద్రగర్భంలో దాగున్న వేల కోట్ల నిధి.. వెలికి తీసేందుకు రంగంలోకి దిగిన కంపెనీ!

ఇంటర్నెట్ డెస్క్: అది 1641. అప్పట్లో ఓ వాణిజ్య నావ రూ.42 వేల కోట్ల నిధితో బ్రిటన్ (Britain) సముద్రతీరానికి కొంత దూరంలో నీట మునిగింది. జలసమాధి అయిన ఆ నావ జాడ కోసం ఆ తరువాత ఎందరో ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. అయితే, ఆధునిక టెక్నాలజీతో నావ జాడ కనిపెడతామంటూ ఓ కంపెనీ తాజాగా ముందుకొచ్చింది. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

అపార నిధినిక్షేపాలున్న ఈ నావను అప్పట్లో ‘సముద్రపు ఎల్‌ డొరాడో’ అని పిలిచేవారు. బ్రిటన్‌లోని కార్న్‌వాల్ తీరం సమీపంలో అది నీట మునిగింది. అందులో సుమారు రూ. 42 వేల కోట్ల విలువైన వెండి, బంగారం దాగుంది. ఇన్ని దశాబ్దాలుగా ఎందరో ఆ నావ ఆచూకీ కోసం ప్రయత్నించిన విఫలమయ్యారు. తాజాగా మల్టీబీమ్ సర్వసెస్ అనే సంస్థ నిధి వేటకు రంగంలోకి దిగింది (Quest for El dorado of 'seas' sank in Atlantic in 1641).

Viral Video: వామ్మో.. ఎర్రనాగు.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో!


సముద్రంలో కూలిపోయిన నావల జాడను కనిపెట్టడంలో మల్టీబీమ్ సర్వీసెస్ సంస్థకు మంచి అనుభవం ఉంది. ప్రస్తుతమున్న ఆధునిక టెక్నాలజీతో ఆ నిధి జాడ కనుక్కోవడం సాధ్యమని సంస్థ బలంగా విశ్వసిస్తోంది. సముద్రం అడుగున 200 చదరపు మైళ్ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం అత్యాధునిక మానవరహిత వెసెల్స్, సోనార్ టెక్నాలజీ సాయంతో సముద్రగర్భాన్ని జల్లెడ పడుతుంది. ఈ ఏడాది మొత్తం గాలింపు చర్యలు ఉంటాయని సంస్థ పేర్కొంది.

ఇది నిధుల వేట కాదని మల్టీబీమ్‌ సర్వీసెస్‌కు నేతృత్వం వహిస్తున్న నైజెల్ హాడ్జ్ మీడియాకు తెలిపారు. ఇది చారిత్రక సంపద అని, దానికున్న విలువ అపారమని వ్యాఖ్యానించారు. ఆ నిధిని వారసత్వ సంపదగా భావిస్తామని అన్నారు. సముద్రంలోని అత్యంత ప్రమాదకర ప్రాంతంలో ‘ఎల్ డొరాడో’ కూలిపోయిందని, కాబట్టి అక్కడ గాలింపు చర్యలు ఓ సవాలని అన్నారు.

‘‘ఆ ప్రాంతంలో వేలకొద్దీ నావలు మునిగిపోయాయి. వాటి అవవేషాలన్నీ అక్కడే ఉన్నాయి. వాటిల్లోంచి ఎల్ డొరాడో ఎక్కడ ఉందో గుర్తించి వెలికి తీయాల్సి ఉంటుంది. ఇది సులభమైన అంత పని అయ్యుంటే ఈపాటికే దాన్ని ఎవరోఒకరు వెలికి తీసి ఉండేవారు’ అని అన్నారు. నావ కూలిన ప్రాంతం తమకు బాగా తెలుసునని అన్నారు. ఆధునిక టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి విజయం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 05:51 PM