Share News

Viral: వామ్మో.. రూ.333ల పానీ పూరీ.. ఎక్కడో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:36 PM

ముంబై ఎయిర్‌పోర్టులో పానీపురీ ధర రూ.333గా ఉందని షుగర్ కాస్మెటిక్స్ సంస్థ సీఈఓ నెట్టింట చెప్పుకొచ్చారు. ఈ ధర చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.

Viral: వామ్మో.. రూ.333ల పానీ పూరీ.. ఎక్కడో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇంటర్నెట్ డెస్క్: పానీ పూరీ.. భారతీయులందరికీ పరిచయమైన పేరిది. స్కూలు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఏదోక సమయంలో పానీ పూరీ తిన్నవాళ్లే! దేశంలో అత్యధిక శాతం మందికి నచ్చే స్నాక్ ఇది. మరి పానీ పూరీ ధర ఎంత అంటే.. రూ.10, రూ.50 అని చెబుతుంటాం. కానీ, రూ.333ల విలువైన పానీపూరీల ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. షుగర్ కాస్మెటిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఓఓ దీన్ని నెట్టింట పంచుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఈ ధరలకు వీటిని అమ్ముతున్నారంటూ ఆయన నోరెళ్లబెట్టారు.

పానీపూరీ ధరలు ఉన్న ఫొటోను కూడా సంస్థ సీఈఓ షేర్ చేశారు. ఎయిర్‌పోర్టులో షాపుల అద్దెలు ఎక్కువగా ఉంటాయని తెలుసు కానీ మరీ పానీపూరీలను రూ.333లకు అమ్మేంత రేంజ్‌లో ఉంటాయని తాను ఊహించలేదని కామెంట్ చేశారు (Panipoori being sold at rs 333 in mumbai airport).

Viral: మగ సింహం కళ్లల్లోకి గుచ్చిగుచ్చి చూశాడు.. ఆడ సింహం వచ్చి కాపాడకపోయి ఉంటే..


ఇక పానీపూరీల రేట్ కార్డు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. వీటిని ఏమైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారా అని కొందరు సెటైర్లు పేల్చారు. ఇంత ధర ఉన్న వాటిని అమ్మకూడదని, మ్యూజియంలో పెట్టాలని కొందరు కామెంట్ చేశారు.

కొందరు మాత్రం షుగర్ కాస్మెటిక్స్ సంస్థ అనుమానాలు నిజమేనని చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్టు లోపలి షాపుల అద్దెలు భారీగా ఉండటంతో అక్కడి ఆహారాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయని అన్నారు. ఏది ఏమైనా ఇంత రేటు పెట్టి పానీపూరీ తినాల్సిన అవసరమే లేదని అనేక మంది అభిప్రాయపడ్డారు.

Read Viral and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 05:42 PM