Share News

Kanniyakumari: ఒకే సమయంలో సూర్యాస్తమయం-చంద్రోదయం.. కన్నియాకుమారిలో అపురూప దృశ్యం

ABN , Publish Date - Apr 24 , 2024 | 10:49 AM

చిత్తిరై మాసం పౌర్ణమిని భక్తులు కోలాహలంగా జరుపుకున్నారు. ఆ రోజున సూర్యాస్తమయం, చంద్రోదయం ఒకే సమయంలో కన్నియాకుమారి(Kanniyakumari)లో కనిపించే అపురూప దృశ్యం వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు.

Kanniyakumari: ఒకే సమయంలో సూర్యాస్తమయం-చంద్రోదయం.. కన్నియాకుమారిలో అపురూప దృశ్యం

చెన్నై: చిత్తిరై మాసం పౌర్ణమిని భక్తులు కోలాహలంగా జరుపుకున్నారు. ఆ రోజున సూర్యాస్తమయం, చంద్రోదయం ఒకే సమయంలో కన్నియాకుమారి(Kanniyakumari)లో కనిపించే అపురూప దృశ్యం వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఈ ఏడాది చిత్తిరై పౌర్ణమి మంగళవారం రాగా, భక్తులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదికూడా చదవండి: Delhi: నకిలీ ఆన్‌లైన్‌ కోర్సులతో జాగ్రత్త: యూజీసీ

ఈ క్రమంలో, మంగళవారం సాయంత్రం 6 గంటలకు కన్నియాకుమారిలో సూర్యాస్తమయం జరిగే సమయంలో చంద్రోదయం అయ్యే దృశ్యాలను భక్తులు వీక్షించారు. ఈ అరుదైన సంఘటనలో, సూర్యుడు బంతి ఆకారంలో అరేబియా సముద్రం పశ్చిమ వైపులో మునిగిపోతాడు. ఆ సమయంలో తూర్పు బంగాళాఖాతం ప్రాంతంలో చంద్రుడు వృత్తాకార కాంతిలో కనిపిస్తాడు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు కన్నియాకుమారి త్రివేణి సంగమం, సన్‌సెట్‌ తీర ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇదికూడా చదవండి: Bihar: బిహారీలు జైకొట్టేదెవరికి? ఎన్డీయేను మళ్లీ ఆదరిస్తారా.. ఇండియా కూటమిని నిలబెడతారా

Read Latest National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 10:49 AM