Share News

Viral: రైలు వస్తుండగా ప్లాట్‌ఫాంపై నిలబడి ఫారినర్ వీడియో రికార్డింగ్.. ఆ తరువాత..

ABN , Publish Date - May 27 , 2024 | 06:56 PM

భారత పర్యటనలో ఉన్న ఓ విదేశీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన తుంటరి పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తొలుత అతడు పోస్ట చేసిన వీడియో చూసి పొరపాటు పడ్డ కొందరు తరువాత అసలు విషయం తెలిసి ఫారినర్‌ను విమర్శించారు.

Viral: రైలు వస్తుండగా ప్లాట్‌ఫాంపై నిలబడి ఫారినర్ వీడియో రికార్డింగ్.. ఆ తరువాత..

ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనలో ఉన్న ఓ విదేశీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన తుంటరి పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తొలుత అతడు పోస్ట చేసిన వీడియో (Viral) చూసి పొరపాటు పడ్డ కొందరు తరువాత అసలు విషయం తెలిసి ఫారినర్‌ను విమర్శించారు. మరికొందరు మాత్రం అతడి ప్రయత్నం చూసి పడీపడీ నవ్వుకున్నారు. అతడు ఊహించినంత ఫన్నీగా వీడియోలేదని మరికొందరు కుండబద్దలు కొట్టారు.

ఆడమ్ అనే ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ఇటీవల ముంబైలో ఓ ప్రాంక్ వీడియో చేశాడు. తొలుత ఓ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై నిలబడి షార్ట్ వీడియో తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రైలు ఆడమ్ పక్క నుంచి వెళ్లే క్రమంలో ఓ ప్యాసెంజర్ ఆడమ్ సెల్‌ఫోన్ లాక్కున్నాడు. వీడియో అక్కడితో ముగిసిపోయింది. ఆ తరువాత ఆడమ్ అదే వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి తన ఫోన్ ఎవరో కొట్టేశారని ఓ ఫన్నీ కామెంట్ చేశాడు. ఆ ఫోన్ కొట్టేసింది చివర్లో తన ఫ్రెండేనని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందీ వివరిస్తూ రాసుకొచ్చాడు. తాము సరదాగా ఉంటుందని ఇలాంటి ప్రయత్నం చేశామని చెప్పాడు (Foreigner prank video in mumbai railway station).

Viral: వామ్మో.. అపరకుబేరులు! వీళ్ల బాత్‌రూంలో ఏముందో చూస్తే..


జనాలకు మాత్రం ఆడమ్ ప్రయత్నం అస్సలు నచ్చలేదు. వీడియో చూడగానే తమకు విషయం అర్థమైపోయిందని కొందరు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ముంబైలో జరగవని మరోకరు చెప్పారు. ఇలాంటి వీడియోలు పోస్టే చేసి వ్యూస్ రాబట్టుకుందామంటే కుదరదని మరికొందరు అన్నారు. కొందరికి మాత్రం ఇదంతా ఫన్నీగా అనిపించింది. ‘‘నీ ఫోన్ కొట్టేసిన దొంగ ఆ వీడియోను నీఫోన్ లోంచే నీ ఇన్ స్టా గ్రామంలో పోస్ట్ చేశాడంటే జనాలు నమ్మరు బ్రో.. చూడగానే విషయం అర్థమైపోయింది’’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - May 27 , 2024 | 06:56 PM