Share News

Viral: ఇంటర్వ్యూకు వచ్చిన యువతి కోరిక విని నోరెళ్లబెట్టిన కంపెనీ సీఈఓ!

ABN , Publish Date - Mar 14 , 2024 | 03:21 PM

ఇంటర్వ్యూకు వచ్చిన ఓ యువతి రూ. 45 లక్షల ప్యాకేజీ ఆశించిన వైనం చూసి ఓ కంపెనీ నోరెళ్లబెట్టారు. ఉండబట్టలేక ఈ ఉదంతాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు.

Viral: ఇంటర్వ్యూకు వచ్చిన యువతి కోరిక విని నోరెళ్లబెట్టిన కంపెనీ సీఈఓ!

ఇంటర్నెట్ డెస్క్: తన కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరైన ఓ యువతి కోర్కె విని షాకైపోయాడా కంపెనీ సీఈఓ. మా వల్ల కాదంటూ సైలెంట్‌గా సాగనంపేశాడు. ఆ తరువాత ఆయన జరిగిన ఉదంతం గురించి నెట్టింట పంచుకోవడంతో ఘటన వైరల్‌గా (Viral) మారింది. నెట్టింట్లో మాత్రం కొందరు యువతి తీరును సమర్థించే ప్రయత్నం చేశారు.

Viral: పెళ్లిలో వరుడి కంట కన్నీరు.. డాక్టర్ వధువుకు అతడిపై డౌటొచ్చి..


వాన్షివ్ టెక్నాలజీస్ సంస్థ సీఈఓ గౌరవ్ ఖేతర్‌పాల్ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. ఇటీవల తన కంపెనీలో ఇంటర్వ్యూకు ఓ మంచి అభ్యర్థి వచ్చిందని ఆయన చెప్పారు. ఆమె గొప్ప ప్రతిభావంతురాలిగా కనిపించిందన్నారు. దీంతో, ఆమె విషయాన్ని హెచ్‌‌ఆర్ వాళ్లకు రిఫర్ చేశానని చెప్పారు. ఆమెతో మాట్లాడిన హెచ్‌ఆర్ విభాగం వారు యువతి ఏకంగా రూ.48 లక్షల శాలరీ అడిగినట్టు చెప్పుకొచ్చారు (Candidate asks for rs 45 lakh). ఆమె ప్రస్తుత శాలరీ రూ.28 లక్షలేనని, పని అనుభవం కూడా నాలుగేళ్లేనని అన్నారు. ఆమె కోరిక విని షాకైపోయానని, చేసేదేంలేక ఆమెను ఉద్యోగం తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

Viral: తప్పు చేసి భారీ మూల్యం చెల్లించిన బబూన్ కోతి! సింహం ఏ రేంజ్‌లో రివెంజ్ తీర్చుకుందో చూస్తే..


అయితే, కొందరు నెటిజన్లు మాత్రం యువతి అడిగిన దాంట్లో తప్పేంలేదన్నారు. సామర్థ్యం ఉన్న అభ్యర్థులు అడిగిన శాలరీ ఇచ్చేందుకు కంపెనీలు వెనకాడకూడదని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఏకీభవించిన కంపెనీ సీఈఓ..తన కంపెనీ చిన్నది కాబట్టి అంత ఇచ్చుకోలేకపోయామని కుండబద్దలు కొట్టారు. ఇలాంటి జీతాలను భారీ ఫండింగ్ ఉన్న సంస్థలు తప్ప తమ లాంటి వాటికి సాధ్యం కాదన్నారు.

Viral: కిడ్నీ అమ్ముదామనుకున్న చార్టర్డ్ అకౌంటెంట్.. ఒక కిడ్నీకి రూ.2 కోట్లు వస్తాయని తెలిసి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2024 | 03:31 PM