Share News

Allu Arjun: రోడ్ సైడ్ దాబాలో అల్లూ అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటో..

ABN , Publish Date - May 22 , 2024 | 12:46 PM

Allu Arjun and Sneha Reddy Viral Photo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన భార్య స్నేహా రెడ్డితో(Sneha Reddy) కలిసి రోడ్ సైడ్ దాబాలో సందడి చేశారు. దాబాలో ఇద్దరూ భోజనం(Lunch in Daba) చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరూ దాబాలో భోజనం చేస్తుండగా..

Allu Arjun: రోడ్ సైడ్ దాబాలో అల్లూ అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటో..
Allu Arjun and Sneha

Allu Arjun and Sneha Reddy Viral Photo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన భార్య స్నేహా రెడ్డితో(Sneha Reddy) కలిసి రోడ్ సైడ్ దాబాలో సందడి చేశారు. దాబాలో ఇద్దరూ భోజనం(Lunch in Daba) చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరూ దాబాలో భోజనం చేస్తుండగా ఓ అభిమాని ఫోటో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వైరల్ ఫోటోలో అల్లు అర్జున్ ఫోన్ మాట్లాడుతుండగా.. స్నేహ భోజనం చేస్తోంది. ఈ ఫోటోను షేర్ చేసిన అభిమాని.. ‘అల్లు అర్జున్ అన్న, స్నేహ గారూ రోడ్డు పక్కన దాబాలో భోజనం చేస్తున్నారు. సింప్లిసిటీకి కేరాఫ్ అల్లు అర్జున్’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోను అభిమానులు లైక్స్, షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు.


అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప: ది ఫైర్ ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌పై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక పుష్ప మొదటి భాగం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్‌తో పాటు.. ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. పుష్ప: ది రైజ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. త్వరలో రానున్న పుష్ప 2 ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసేస్తుందని అభిమానులు గట్టి విశ్వాసంతో ఉన్నారు.

For More Trending News and Telugu News

Updated Date - May 22 , 2024 | 01:33 PM