YS Raja Reddy Marriage: వైఎస్ రాజారెడ్డి-ప్రియా అట్లూరి పెళ్లి ఫొటోలు చూశారా.. చూపు తిప్పుకోలేరు అంతే!
ABN, Publish Date - Feb 19 , 2024 | 11:35 AM
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి- ప్రియా అట్లూరిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్లోని జోథ్పూర్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఇరు కుటుంబాలు, వైఎస్ విజయమ్మ మాత్రమే ఫొటోల్లో కనిపిస్తున్నారు.
1/5
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి- ప్రియా అట్లూరిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్లోని జోథ్పూర్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వేడుకకు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఇరు కుటుంబాలు, వైఎస్ విజయమ్మ మాత్రమే ఫొటోల్లో కనిపిస్తున్నారు.
2/5
క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగిన రాజారెడ్డి-ప్రియా వివాహం. పెళ్లి ప్రార్థనలు చేయడానికి విదేశాల నుంచి పాస్టర్లు విచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
3/5
పెళ్లికి సంబంధించిన వండర్ఫుల్ వీడియోను ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల షేర్ చేశారు. అందమైన జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్.. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిందని అని ఆమె రాసుకొచ్చారు.
4/5
తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి తన కుమారుడు, కోడలిపై ఆశీర్వాదాలను కురిపిస్తున్నట్లుగా అనిపించిందని షర్మిల వీడియో రిలీజ్ చేశారు. అద్భుతమైన ఈ వేడుక మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
5/5
జోథ్పూర్ ప్యాలెస్ ముందు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్తో రాజారెడ్డి ఫొటో దిగారు. ప్యాలెస్, ఈ ముగ్గురి ప్రతిబింబాలు అచ్చంగా అద్దంలో కనిపించినట్లుగా ఉండటంతో ఈ ఫొటో నెటిజన్లను కట్టిపడేస్తోంది.. ఆలస్యమెందుకు మీరూ ఓ లుక్కేసేయండి.
Updated at - Feb 19 , 2024 | 11:35 AM