Shobhayatra: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..
ABN, Publish Date - Sep 17 , 2024 | 11:09 AM
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులు, అధికారులు భారీ ట్రక్కును తెప్పించారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని ట్రక్కులోకి ఎక్కించారు. మంగళవారం ఉదయం 6:15 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకు పెద్దఎత్తున సాగనుంది. వందల, వేల మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే ఖైరతాబాద్కు చేరుకున్నారు.
1/7
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. గణేశుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి ప్రారంభించారు.
2/7
వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..
3/7
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు..
4/7
కన్నుల పండువగా ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి..
5/7
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో భక్తజనసందోహం..
6/7
మహాగణపతి శోభాయాత్రలో నృత్యాలు చేస్తున్న మహిళలు..
7/7
కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..
Updated at - Sep 17 , 2024 | 11:09 AM