Yadadri: యాదగిరిగుట్టపై వైభవంగా రథోత్సవం
ABN, Publish Date - Mar 20 , 2024 | 12:48 PM
ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కల్యాణలక్ష్మీనరసింహుడు దివ్య విమానరథంలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశారు. జగత్ కల్యాణం..విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో దివ్యవిమాన రథోత్సవం శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో రాత్రి వేళ మూలమూర్తులకు మహానివేదనల అనంతరం వైభవంగా కొనసాగింది.
Updated at - Mar 20 , 2024 | 12:48 PM