Pawan: అనకాపల్లి జిల్లాలో పవన్ వారాహి విజయభేరి సభ
ABN, Publish Date - Apr 08 , 2024 | 12:59 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అనకాపల్లి నెహ్రూచౌక్లో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలతో అనకాపల్లి జన సంద్రాన్ని తలపించింది. సుంకరమెట్ట కూడలి నుంచి నెహ్రూచౌక్ వరకు ర్యాలీగా వచ్చిన జనసేనానికి అఖండ స్వాగతం పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే అనకాపల్లి దశ మారుస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Updated at - Apr 08 , 2024 | 12:59 PM