కర్నూలులో భారీ వర్షం.. లోతట్టు కాలనీలు జలమయం

ABN, Publish Date - Jun 10 , 2024 | 10:25 AM

కర్నూలు: వరుసగా కురుస్తున్న వర్షానికి కర్నూలు, కల్లూరు నగరంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. అశోక్‌నగర్‌, డీమార్టు ఏరియా, కొత్తబస్టాండుకు వెళ్లే కేసీ కెనాల్‌ బ్రిడ్జి కింద, కల్లూరులో బ్రిడ్జి ప్రాంతంతోపాటు లోతట్టు కాలనీల్లో నీటి నిల్వ చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెత్తా చెదారం కాలువల్లో పేరుకుపోవడంతో లోతట్టు కాలనీల్లోని మురు గునీరు బయటకు పోయే దారి లేక రోడ్లపై ఏరులై పారుతోంది.

Updated at - Jun 10 , 2024 | 10:25 AM