కార్తీక సోమవారం.. శివాలయానికి పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:11 AM
కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకొని రాజమండ్రి పుష్కర్ ఘాటులో భక్తులు గోదావరి స్నానం ఆచరిస్తున్నారు. అనంతరం భక్తులు శివాలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మొదటి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నవంబరు 2వ తేదీ నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
1/6
కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకొని రాజమండ్రి పుష్కర్ ఘాటులో శివాలయంలో శివలింగానికి పాలభిషేకం చేస్తున్న అర్చకుడు.
2/6
శివాలయంలో నందిశ్వరునికి పూజలు నిర్వహిస్తున్న భక్తులు..
3/6
రాజమండ్రి పుష్కర్ ఘాటులోని శివాలయంలో ధ్వజస్తంభానికి పూజలు చేస్తున్న భక్తులు..
4/6
రాజమండ్రి పుష్కర్ ఘాటులో భక్తులు స్నానాలు చేసి.. సూర్య నమస్కారం చేస్తున్న భక్లులు..
5/6
పుష్కర్ ఘాటులో భక్తులు స్నానాలు చేసి.. అరటి దొప్పలో దీపాలు పెట్టి నదిలో విడిచిపెడుతున్న భక్తులు..
6/6
తొలి కార్తీక సోమవారం సందర్బంగా శివాలయానికి పోటెత్తిన భక్తులు..
Updated at - Nov 04 , 2024 | 11:11 AM