Happy New Year: తిరుమలలో భక్తుల రద్దీ
ABN, Publish Date - Jan 01 , 2024 | 09:09 AM
జనవరి ఒకటో తేదీ (న్యూ ఇయర్) సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆది, సోమవారాలు వరుస సెలవులు రావడంతో శనివారం సాయంత్రం నుంచే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వైకుంఠద్వార దర్శనాలు కూడా సోమవారంతో ముగియనున్నాయి.
1/5
నూతన సంవత్సరం, వైకుంఠద్వార దర్శనాలు సోమవారంతో ముగియనుండడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
2/5
తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామి ప్రసాదాలను ముందుంచుకుని భక్తులు గోవిందనామస్మరణ చేస్తున్న దృశ్యం.
3/5
కొత్త సంవత్సవరం సందర్భంగా భక్తులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న దృశ్యం.
4/5
తిరుమలలో జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకల్లో భక్తులు పాల్గొని.. గోవిందనామస్మరణ చేస్తున్న దృశ్యం.
5/5
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన భక్తులు.. రాత్రి షెడ్లో పడుకున్న దృశ్యం.
Updated at - Jan 01 , 2024 | 09:09 AM